Mysore Pak Recipe: ఈ వ్యాసంలో మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం గూర్చి
తెలుసుకుందాం.
Mysore Pak Recipe కావాల్సిన పదార్థాలు ( Ingredients )
·
సెనగపిండి – 1 Cup
·
పంచదార – 3 Cups
·
నూనె – 2 Cups
·
నీళ్ళు – 1 ½ Cup
·
మైదా - 1 టేబుల్ స్పూన్
·
యెల్లో ఫుడ్ కలర్ – కొద్దిగా
Mysore Pak Recipe తయారు చేయు విధానం ( Instructions)
·
సెనగపిండిలో మైదా, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి బాగా
కలిపి పక్కన పెట్టుకోవాలి.
·
మైసూర్ పాక్ పోసే అచ్చు పాత్రకి నూనె పూసి
పక్కనుంచాలి.
·
అడుగు లోతు మందంగా ఉన్న కడాయిలో పంచదార, నీళ్ళు పోసి పాకం
వచ్చేదాకా మరగనివ్వాలి.
·
పాకం మరిగేలోగా, మరో పాన్ లో నూనె పోసి బాగా
కాగనివ్వాలి.
·
పాకం మరుగుతున్నప్పుడు అంచుల వెంట సరిగ్గా పాకం
రాగానే, వెంటనే
మంట మీడియం ఫ్రేంలోకి పెట్టి సెనగపిండి వేసి బాగా కలుపుతూ ఓ పొంగు రానివ్వాలి.
·
పొంగోచ్చిన వెంటనే మరుగుతున్న ఓ గరిటెడు నూనెను పోసి
మంట హై ఫ్లేం లోకి పెట్టి బాగా కలుపుతూనే ఉండాలి.
·
పాకం నూనెని పీల్చుకుని బుడగలు తగ్గాక, మళ్ళీ ఓ గరిటెడు నూనె
పోసుకుని హై ఫ్లేం మీదే కలుపుతూ ఉండాలి.
·
తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి.
·
ఆ తరువాత ఒక్కసారిగా మిగిలిన వేడి నూనె మొత్తం పాకంలో
పోసి కలపాలి. కలుపుతున్నప్పుడు ఒక్కసారిగా పొంగోతుంది. అప్పుడు వెంటనే అచ్చు
పాత్రలోకి ఒక్కసారిగా పోసేయాలి.
·
పాకం పోసిన వెంటనే 2 టేబుల్ స్పూన్లు పంచదార
చల్లుకోవాలి.
·
పాకాన్ని 10-15 నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ
తరువాత బ్లేడ్ తో ముక్కలుగా కట్ చేసి 5 గంటలు
చల్లారనివ్వాలి.
·
5 గంటల తరువాత బ్లేడ్ తో మల్లి ముక్కలు కట్ చేస్తే సులభంగా
వస్తాయి.
గమనిక (Note)
·
కడాయి ఎప్పుడూ, చేసే కొలతకి 3
ఇంతలు ఉండాలి. అంటే కిలో మైసూర్ పాక్ చేయాలంటే 3 కిలోలు
చేసేంత కడాయి అవసరం అవుతుంది.
·
కడాయిలో నూనె పోసి బాగా వేడిగా సలసల మరగపెట్టాలి, అప్పుడే మైసూర్ పాక్
బాగా వస్తుంది.
·
ముందుగానే సెనగపిండిని జల్లించి నూనె పోసి కలిపితే
రవ్వ మాదిరిగా అయ్యి, పాకంలో వేసాక వెంటనే కరిగిపోతుంది, పాకంలో
గడ్డలు గడ్డలుగా అవ్వకుండా ఉంటుంది.
·
పంచదార పాకం కచ్చితంగా ఓ తీగ పాకం రావాలి. లేత పాకం
వస్తే విరిగిపోతుంది. ముదురు పాకం వస్తే గట్టిగా రాయిలా అవుతుంది.
·
పాకం మరుగుతున్నపుడు అంచుల వెంట 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు
చల్లుకోవాలి. మరుగుతూ చిక్కబడుతున్న పాకం కడాయికి అంటుకుని పాకం నల్లబడుతుంది.
అచుల వెంట నీళ్ళు చల్లి పాకాన్ని కలుపుతూ ఉంటే మైసూర్ పాక్ రంగు మారదు.
·
సెనగపిండి పాకంలో పోసే టైంకి నూనె సలసల మరుగుతుండాలి.
·
పాకంలో వేసిన సెనగపిండి ఒక్క ఉడుకు రాగానే మరుగుతున్న
నూనె పోసి హై-ఫ్లేం మీద మాత్రమే కలుపుతూ ఉండాలి. లేదంటే పాకం గుల్లగా రాదు. మైసూర్
పాక్ పాకం మొత్తం హై ఫ్లేం మీదే చేయాలి.
·
పాకం తయారయ్యాక అచ్చుగా పోసేందుకు కావలసిన పాత్రను
ముందే సిద్దంగా ఉంచుకోవాలి. పొయ్యి మీద నుండి దిమ్పాక ఎమాతరం ఆలస్యం చేసినా
క్షణాల్లో మైసూర్ పాక్ రుచి, రూపం మారిపోతుంది. అందుకే వెంటనే పోసేయాలి అచ్చు పాత్రలో.
·
అందుకే మైసూర్ పాక్ మొదలు పెట్టడానికి ముందే అచ్చు
పాత్రకి నూనె పట్టించి ఉంచుకోవాలి.
·
ఆఖరున అంటే పాకం అచ్చు పాత్రలో పోసాక 2 టేబుల్ స్పూన్లు పంచదార
వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు.
·
యెల్లో ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి, లేదంటే వదిలేయోచ్చు.
·
మైసూర్ పాక్ కి యాలకల పొడి లాంటివి అవసరం లేదు.
కమ్మగా వేగిన సెనగపిండి అరోమా చాలా బాగుంటుంది.
·
మిగిలిన నూనె అంతా చోవర్లో ఒక్క సారిగా పోసేసి కలపాలి, అప్పుడు పొంగుతుంది. ఆ
పొంగు చాలా అవసరం. ఆఖరున వచ్చే ఆ పొంగే మైసూర్ పాక్ లో గుల్లగా మిగిలి ఉంటుంది.
·
పొంగిన పాకం ఒక్కసారిగా అచ్చు పాత్రలో పోసేయాలి.
లేదంటే పొడిపొడిగా అవుతుతుంది. మైసూర్ పాక్ ని వేడి మీదే కత్తితో కాక బ్లేడ్ తో
కట్ చేసుకుంటే సరిగా వస్తుంది షేప్.
· Mysore Pakని 4-5 గంటలు చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టి చల్లార బెట్టకూడదు.
Mysore Pakలో 10% వేస్ట్ అవుతుంది. ఎంత జాగ్రత్తగా చేసినా కొన్ని విరిగిపోతాయి.