Srimad Bhagavad Gita Chapter 1 – Arjuna Vishada Yoga (Verses 31-47) :
అథ ప్రథమోఽధ్యాయః
అర్జున విషాద యోగః
శ్లో || నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ! |
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా
స్వజన మాహవే || 31
తా || కేశవా!
దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. స్వజనాన్ని చంపడంవల్ల జరిగే మేలు ఏమిటో
తెలుసుకోలేకుండా వున్నాను.
శ్లో || న కాంక్షే విజయం కృష్ణ! న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద! కిం
భోగైర్జీవితేన వా || 32
తా || ఓ
కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని, సుఖాలు
కాని కోరను. గోవిందా! మనకు రాజ్యం వల్ల గాని, భోగాల వల్ల
గాని, జీవించడం వల్ల గాని ప్రయోజనం ఏమిటి?
శ్లో || యేషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా స్సుఖాని చ |
త ఇమేఽవస్థితా యుద్ధే
ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ || 33
తా || ఎవరికోసం
మనం రాజ్యాన్నీ, సుఖభోగాలనీ కోరుకుంటామో, వారు ప్రాణాలనీ, సంపదలనీ త్యజించి ఇక్కడ యుద్ధరంగంలో
నిలబడి ఉన్నారు.
శ్లో || ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః
శ్యాలాః సంబంధిన స్తథా || 34
తా || ఆచార్యులూ,
తండ్రులూ, పుత్రులూ అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ,
బావమరుదులూ, వియ్యంకులును...
శ్లో || ఏతాన్న హంతు మిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన! |
అపి త్రైలోక్య రాజ్యస్య
హేతోః కిం ను మహీకృతే || 35
తా || మధుసూదనా!
నేను చంపబడినప్పటికీ, త్రోలోకాధిపత్యానికైనా వీరిని
చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా?
శ్లో || నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్స్యా జ్జనార్దన |
పాపమేవాశ్రయే దస్మాన్
హత్వైతా నాతతాయినః || 36
తా || జనార్దనా!
ధృతరాష్ట్ర కుమారులని చంపడంవల్ల మనకి ఏమి సంతోషం కలుగుతుంది? ఆతతాయుల్ని చంపినా మనకి పాపమే వస్తుంది.
శ్లో || తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః
స్యామ మాధవ! || 37
తా || అందువల్ల మనబంధువులైన ధృతరాష్ట్ర
పుత్రులను చంపడం తగదు. మనవాళ్ళని చంపుకోవడంవల్ల మనం ఎలా సుఖపడగలము?
శ్లో || యద్య ప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః |
కులక్షయకృతం దోషం
మిత్రద్రోహేచ పాతకమ్ || 38
తా || లోభం
చేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయంవల్ల కలిగే దోషాన్ని, మిత్రద్రోహం
వల్ల కలిగే పాపాన్ని చూడలేకపోయినప్పటికీ,
శ్లో || కథం న జ్ఞేయ మస్మాభిః పాపా దస్మా న్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం
ప్రపశ్యద్భి ర్జనార్దన || 39
తా || జనార్దనా!
కులక్షయంవల్ల ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగకూడదు?
శ్లో || కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నం
అధర్మోఽభి భవత్యుత || 40
తా || కులక్షయం
వల్ల సనాతనమైన కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు యావత్తు కులం అధర్మంవైపు
తిరుగుతుంది.
శ్లో || అధర్మాభిభవాత్ కృష్ణ! ప్రదుష్యంతి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్
ష్ణేయ జాయతే వర్ణసంకరః || 41
తా || కృష్ణా!
అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. వార్ ష్ణేయా! చెడిన స్త్రీల వల్ల
వర్ణ సంకరం ఏర్పడుతుంది.
శ్లో || సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్యచ |
పతంతి పితరో హ్యేషాం
లుప్తపిండోదక క్రియాః || 42
తా || సాంకర్యంవల్ల
కులానికి, కులాన్ని నాశనం చేసిన వారికి నరకమే గతి. వీరి
పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.
శ్లో || దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః
కులధర్మాశ్చ శాశ్వతాః || 43
తా || వర్ణసంకరానికి
కారకులైన కులనాశకుల ఈ దోషాలవల్ల శాశ్వతమైన జాతి ధర్మాలూ, కులధర్మాలూ
పెకలింపబడతాయి.
శ్లో || ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకేఽనియతం వాసః భవతీ
త్యనుశుశ్రుమ || 44
తా || జనార్దనా!
కులధర్మాలూ తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరకవాసు లౌతారని విన్నాం.
శ్లో || అహో బత! మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్య సుఖలోభేన హంతుం
స్వజన ముద్యతాః || 45
తా || అకటా!
రాజ్యసుఖం మీద ఆశతో స్వజనాన్ని వధించడానికి సిద్ధమైన మనం ఎంత మహాపాపానికి
ఒడిగట్టుతున్నాము!
శ్లో || యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్ || 46
తా || ప్రతీకారం
చెయ్యక నిరాయుధుడై వున్న నన్ను శాస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో చంపినా,
దానివల్ల నాకు ఎక్కువ మేలే కలుగుతుంది.
సంజయఉవాచ:
శ్లో || ఏవ ముక్త్వాఽర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోక
సంవిగ్నమానసః || 47
సంజయుడు అన్నాడు:
తా || అర్జునుడు
ఇలా పలికి, శోకంతో నిండిన మనస్సుతో, యుద్ధ
భూమిలో బాణాలతో రక్షించే సహా ధనుస్సుని వదిలి రథం
వెనక భాగంలో కూర్చున్నాడు.
ఓంతత్సత్,
ఇతి శ్రీ మద్భగవద్గీతాసు, ఉపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం,
యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే, అర్జున
విషాదయోగోనామ, ప్రథమోఽధ్యాయః ||
ఓం తత్సత్, ఇలా భగవద్గీత అనే ఉపనిషత్తులో, బ్రహ్మవిద్యా
యోగశాస్త్రంలో, శ్రీ కృష్ణార్జున సంవాదంలో, అర్జున
విషాదయోగమనే
మొదటి అధ్యాయం సమాప్తం.