Srimad Bhagavad Gita Chapter 1 – Arjuna Vishada Yoga (Verses 14-30):
అథ ప్రథమోఽధ్యాయః
అర్జున విషాద యోగః
శ్లో || తతః శ్వేతై ర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ
శంఖౌ ప్రదధ్మతుః || 14
తా || అప్పుడు
తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్పరథంలో కూర్చున్న మాధవుడూ, అర్జునుడూ
దివ్యశంఖాలను ఊదారు.
శ్లో || పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః |
పౌండ్రం దధ్మౌ మహాశంఖం
భీమకర్మా వృకోదరః || 15
తా || పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని
ధనంజయుడూ, పౌండ్రమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడూ
ఊదారు.
శ్లో || అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకుల స్సహదేవశ్చ సుఘోష
మణిపుష్పకౌ || 16
తా || కుంతీపుత్రుడు
ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష మణిపుష్పకాలనే వాటిని నకుల
సహదేవులు ఊదారు.
శ్లో || కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ
సాత్యకి శ్చాపరాజితః || 17
తా || ఓ
రాజా! గోప్పధనువు కలిగిన కాశీరాజూ, మహారథుడైన శిఖండీ,
ధృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ-
శ్లో || ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్
దధ్ముః పృథక్ పృథక్ || 18
తా || ద్రుపదుడూ,
ద్రౌపది కుమారులు, మహాబాహుడైన అభిమన్యుడూ
వేరువేరుగా శంఖాలను ఊదారు.
శ్లో || సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో
వ్యనునాదయన్ || 19
తా || ఆ
ధ్వని భూమ్యాకాశాలలో మారు మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.
శ్లో || అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్త రాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసంపాతే
ధనురుద్యమ్య పాండవః || 20
శ్లో || హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే |
తా || రాజా!
అప్పుడు యుద్ధానికి సిద్ధమై నిలబడి వున్న కౌరవులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు
బాణాలు వదలడానికి ధనువు నెత్తి, హృషీకేశునితో ఈ విధంగా
అన్నాడు.
అర్జునఉవాచ:
శ్లో || సేనయో రుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత || 21
శ్లో || యావదేతా న్నిరీక్షేఽహం యోద్ధుకామా నవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యం
అస్మిన్ రణసముద్యమే || 22
అర్జునుడన్నాడు:
తా || అచ్యుతా!
యుద్ధం చేయగోరి నిలబడి ఉన్న వీరిలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి వుంటుందో
వాళ్ళందరినీ చూడాలి. యుద్ధం చేయగోరి నిలుచున్న వీరినందరినీ చూడడానికి వీలుగా రెండు
సేనలకి మధ్య నా రథాన్ని నిలబెట్టు.
శ్లో || యోత్స్యమానాన వేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః
యుద్ధే ప్రియచికీర్షవః || 23
తా || దుర్బుద్ధి
అయిన దుర్యోధనుడికి ప్రియం చేయగోరి యుద్ధం కోసం ఎవరెవరు ఇక్కడ సమావేశామైనారో
వాళ్ళని నేను చూస్తాను.
సంజయ ఉవాచ:
శ్లో || ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత! |
సేనయో రుభయో ర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమమ్ || 24
సంజయుడు అన్నాడు:
తా || ఇలా
అర్జునుడి చేత అడగబడిన శ్రీకృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమ రథాన్ని నిలబెట్టి,
శ్లో || భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ! పశ్యైతాన్
సమవేతాన్ కురూనితి || 25
తా || భీష్మ
ద్రోణులకి మరియు రాజులందరికి ఎదురుగా (రథం నిలిపి) "పార్థా! సమావేశమై యున్న ఈ
కురువుల్ని చూడు" అన్నాడు.
శ్లో || తత్రాపశ్యత్
స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్
పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ స్తథా || 26
తా || అప్పుడు
అర్జునుడు తండ్రులని, తాతలని, గురువుల్ని,
మేనమామల్ని, అన్నదమ్ముల్ని, కుమారులని, మనుమలని చూచాడు
శ్లో || శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయో రపి |
తాన్ సమీక్ష్య స కౌంతేయః
సర్వాన్ బంధూ నవస్థితాన్ || 27
తా || ఇంకా
అర్జునుడు, మామలనీ, సజ్జనులనీ, రెండు సేనలలోను నిలబడి వున్న యావన్మందీ బంధువుల్ని సమీక్షించి,
శ్లో || కృపయా పరయాఽఽవిష్టః విషీదన్నిద మబ్రవీత్ |
అర్జునఉవాచ:
శ్లో || దృష్ట్వేమం స్వజనం కృష్ణ! యుయుత్సుం సముపస్థితమ్ ||
28
అర్జునుడు అన్నాడు:
తా || మిక్కుటమైన
కరుణ ఆవహించగా విషాదంతో అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణా! యుద్ధం చేయగోరి సమావేశమై
వున్న నా ఈ బంధువులను చూడగా;
శ్లో || సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే
రోమహర్షశ్చ జాయతే || 29
తా || నా
అవయవాలు శిథిలమౌతున్నాయి. నోరు ఎండిపోతోంది. నా శరీరం వణుకుతోంది. రోమాలు
నిక్కబొడుచుకొంటున్నాయి.
శ్లో || గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం
భ్రమతీవ చ మే మనః || 30
తా || గాండీవం చేతిలోంచి జారిపోతోంది. ఒళ్ళు మండుతోంది. నిల్చోడానికి ఓపిక లేకుండా వున్నది. మనస్సు భ్రమిస్తోంది.